హుజురాబాద్ లో సంబరాలు
నేటి సాక్షి, హుజూరాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ లో అంబేద్కర్ చౌరస్తా దగ్గర ఆల్ ఫోర్స్ విద్యాసంస్థల అధినేత ఆయన డాక్టర్ వి నరేందర్ రెడ్డి కి కాంగ్రెస్ పార్టీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆయనను ఏకగ్రీవంగా ఎన్ని క దీని విషయంలోకార్యకర్తల విజయోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. కార్యకర్తలు ఉత్సాహంగా విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ … “ఈ విజయం అన్ని కార్యకర్తల కృషి, ప్రజల ఆశీస్సుల ఫలితం. మీ అందరి సహకారం లేని ఈ ఘనత సాధ్యం కాలేదు. ముందుకు కూడా ఇదే ఆదర్శంతో పనిచేస్తాం” అని అన్నారు. దీనికి కృషి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు తాను కృతజ్ఞతలు తెలిపినారు.కార్యకర్తలను అభినందించారు. అంబేద్కర్ చౌరస్తాలో పటాసులు కాలుస్తూ సంబరాలు అంబరాన్ని అంటించేలాగా కార్యకర్తలు మహోత్సవాన్ని జరుపుకున్నారు.కార్యక్రమాలతో ఆనందోత్సాహంగా వేడుకలను జరిపారు. ఇదే ఉత్సాహంతో కార్యకర్తలు విజయోత్సవం కూడా చేసుకోవాలని ఆశిస్తూ కార్యకర్తలను కోరారు.





