నేటిసాక్షి, ఇబ్రహింపట్నం : ఇబ్రహీంపట్నం మండలం వేములకుర్తి గ్రామానికి చెందిన కమల ప్రవళిక (30) అనే మహిళ గత నాలుగు సంవత్సరాలుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతు చేతిలో ఉన్న డబ్బులు ఖర్చు చేసి ప్రతిరోజు నిత్యం మెడిసిన్ కు ఉపయోగించడంతో ప్రస్తుతానికి బెడ్ రెస్ట్ లో ఉండగా ఇద్దరు పిల్లల చదువులకు, భర్త కమల సాయికృష్ణా చిన్నపాటి హోటల్ నిర్వహించడంతో వచ్చిన సంపాదన భార్య వైద్య ఖర్చులకు సరిపోవడం లేక గత కొన్ని రోజులుగా నిత్య అవసర సరుకులు లేక ఉదయం ఫౌండేషన్ ని సంప్రదించాగా గురువారం ప్రవళిక కుటుంబ సభ్యులకు 25 కిలోల బియ్యంతో పాటు 15 రకాల నిత్యవసర వస్తువులు, రూపాయలు 1 వేయ్యి నగదు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు పంచతి బాలరాజ్, దొంతి మధు, పంచతి రాజేష్, పంచతి వేణుగోపాల్, బొల్లెం నరేష్, నాయకులు దేశేట్టి రాజరెడ్డి,కోటగిరి వెంకటస్వామి, గుడ్ల నాగరాజు పుప్పాల నాగేష్ తదితరులు పాల్గొన్నారు.





