Sunday, March 15, 2026

కె టి దొడ్డి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ సమావేశానికి

  • హాజరైన ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : జోగులాంబ గద్వాల జిల్లా : సోమవారం కే టి దొడ్డి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి సభా అధ్యక్షత ఎమ్మార్పీఎస్ కే టి దొడ్డి మండల ఇంచార్జి గువ్వలదిన్నె జంబయ్య మాదిగ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పోగుల రాజేష్ మాదిగ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కన్వీనర్ పోగుల రాజేష్ మాదిగ మాట్లాడుతూ… ఈనెల 30వ తేదీన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గద్వాల జిల్లా కేంద్రానికి విచ్చేస్తున్నారు. కాబట్టి అట్టి లక్ష డప్పులు వెయ్యి గొంతులు మినీ ప్రదర్శన కార్యక్రమం ఉంటుంది. అనంతరం జిల్లా కేంద్రంలోని బృందావన్ గార్డెన్ లో మీటింగ్ ఏర్పాటు చేయడమైనది. జిల్లాలోని ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి, ఎమ్మెస్ ఎఫ్ అనుబంధ సంఘాల నాయకులు నాయకులు,తమ మండలం తమ గ్రామాల ఎమ్మార్పీఎస్ నాయకులు,కార్యకర్తలను భారీ ఎత్తున తరలించి విజయవంతం చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కో కన్వీనర్ గంజిపేట పరుశురాం మాదిగ, చింతరేవుల ఆంజనేయులు,ఎమ్మార్పీఎస్ నాయకులు డప్పుసంఘం అధ్యక్షుడు పాంటన్న,ఉమిత్యాల అధ్యక్షుడు చిన్న రంగస్వామి,ఉమిత్యాల సత్యన్న, నక్కాలినర్సింలు,గోపి, నర్సింలు, బెల్లంనర్సింలు, పాంటన్న, హన్మంతు,పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News