
నేటిసాక్షి, కొడిమ్యాల : జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ మాల సంఘం బుధవారం నూతన అధ్యక్షునిగా ఆకుల అనిల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బుదవారం రోజున జరిగిన సంఘ సవవేశంలో నూతన కమిటీ నీ ఎన్నుకున్నారు. ఉపాధ్యక్షులుగా తాటి సుధాకర్ ను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాపరి ప్రవీణ్,పుట్ట సాయి తదితరులు పాల్గొన్నారు





