Tuesday, March 31, 2026

పిరమిడ్ కేంద్రం నిర్మాణం వద్దు

  • పంచాయతీ కార్యదర్శికి యువకుల వినతి

నేటిసాక్షి, రాయికల్ : రాయికల్ మండలంలోని మైతాపూర్ గ్రామ శివారులో వ్యవసాయ భూమిలో నిర్మిస్తున్న అక్రమ పిరమిడ్ కట్టడాన్ని కూల్చివేయాలని, ఇట్టి నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వవద్దని గ్రామ యువకులు బుధవారం గ్రామపంచాయతీకి వెళ్లి కార్యదర్శికి వినతిపత్రం అందజేసారు. ఈ నిర్మాణం వల్ల గ్రామంలో ప్రశాంతత దెబ్బతింటదని వివరించారు. కాగ గ్రామ శివారులో ఓ గుడిసె లో చేస్తున్న అన్యమత ప్రచారాన్ని నిలిపివేయాలని కోరుతూ హిందూ చైతన్య వేదిక, ఆలయాల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆ వినతి పత్రంలో కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పిరమిడ్ ముసుగులో హిందూ సాంప్రదాయాలు, ఆచార వ్యవహారాలకు భిన్నంగా అన్యమత ప్రచారం చేస్తూ హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తున్నారని కోరారు. అన్యమతస్తులు మత మార్పిడిలు ప్రోత్సహించడం వెంటనే ఆపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ చైతన్య వేదిక,ఆలయాల పరిరక్షణ కమిటీ సభ్యులు క్యాషనూరి మఠం జగదీశ్వర్,బూస గంగ మల్లయ్య,సద్ది మహిపాల్, బేతి సత్యనారాయణ, దేశ వేని శ్రీనివాస్, శివనీతి కిష్టయ్య, పాలడుగు లింగారెడ్డి, రామన్న, కొల్ల కృష్ణారెడ్డి, వట్టిమల్ల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News