
నేటి సాక్షి,పెద్దపల్లి (వోడ్నాల తిరుపతి);
పెద్దపల్లి, సుల్తానాబాద్ పట్టణాలలో పరిధిలో క్రిస్మస్ పర్వదినం సందర్భంగా పలు చర్చులల్లో నిర్వహించే ప్రత్యేక ప్రార్థనలల్లో పాల్గొని కేక్ కట్ చేసి క్రైస్తవ సోదర సోదరీమణులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమణా రావు… అనంతరం పలు చర్చుల ఫాదర్స్ ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు..ఈ సందర్బంగా ఎమ్మెల్యే విజయరమణా రావు మాట్లాడుతూ…క్రిస్మస్ ఒక ప్రాంత పండుగనే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న పండుగ క్రిస్మస్ పండుగ అలాగే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించమని చెప్పిన క్రీస్తు బోధనలు విశ్వమానవాళికి మార్గదర్శకమన్నారు. శాంతి సహనం కరుణ ప్రతి ఒక్కరూ కలిగి ఉండాలని బోధించిన జీసస్ మాటలు సదా అనుసరించాల్సిన మార్గం అని పేర్కొన్నారు. కరుణామయుడు జీసస్ పుట్టినరోజున మీ జీవితంలో ఆనందాలు నిండాలని, శాంతి, సౌభాగ్యాలు కలగాలని కోరుకుంటున్నారు అలాగే ఏసుక్రీస్తు నేర్పిన మార్గంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం సర్వమత హితంగా పరిపాలన చేస్తుంది. అన్ని మతాల ప్రజాభివృద్ధి కోసం ప్రజా ప్రభుత్వం స్థిర సంకల్పంతో కట్టుబడి పని చేస్తుందని పేర్కొన్నారు. క్రీస్తు బోధనలు మనుషులందరినీ ఎప్పటికీ సన్మార్గంలో నడిచే విధంగా కృషి చేయాలన్న ఎమ్మెల్యే విజయరమణా రావు..ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్, మార్కెట్ చైర్మన్లు ఈర్ల స్వరూప, మినుపాల ప్రకాష్ రావు మరియు పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, క్రైస్తవ సోదర సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు

