- ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా కప్ అందుకున్న యువకులు
- ఫ్రెండ్స్ సిసి యూత్ పెద్దపులినాగారం టీం విజేతలు
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి.శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన యువకులు శంషాబాద్ మండలం పెద్దషాపూర్ గ్రామంలో క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ యొక్క క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ సిసి యూత్ యువకులు తమ సత్తా చాటడం జరిగింది క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచి.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే.. ప్రకాష్ గౌడ్ చేతుల మీదుగా కప్పు అందుకోవడం జరిగింది ఏ గ్రామానికి వెళ్లిన క్రికెట్ టోర్నమెంట్లలో పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన యువకులు.. మొదటి స్థానంలో గెలుపొందడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రెండ్స్ సిసి యూత్ టీం యువకులు… దేశపగ జయేందర్, భాగం కుమార్, జెల్ల.కార్తీక్, మాధవ్, మంగమూరి రఘు, కుండే పవన్, సయ్యద్ రషీద్, టేకుమల విగ్నేష్, కావలి శ్రీశైలం, దేశపగ విగ్నేష్, ఎండి ఆఫ్రోజ్, ఎండి ఖజా, కే చందు, కే కళ్యాణ్, బూర్గుల ప్రశాంత్, ఈ యొక్క టీం లీడర్స్ ని గ్రామస్తులు అభినందించారు. ఫైనల్ మ్యాచ్ లో భాగం కుమార్, 23 బాల్స్, 55 రన్స్ తో ఈ యొక్క టీం ని గెలిపించడం జరిగింది.



