- ఎస్పీ అఖిల్ మహాజన్
నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ) : సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని,సైబర్ క్రైమ్ నేరాలకు గురైతే www.cybercrime.gov.in నందు రిపోర్ట్ చేయండి లేదా 1930 టోల్ ఫ్రీ నెంబర్ కి ఫోన్ కి పిర్యాదు చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం ఒక ప్రకటన లో తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పి అఖిల్ మహాజన్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న సైబర్ నేరాలు క్రైప్టో/ బిట్ కాయిన్ ఫ్రాడ్, పరమిడ్/ మల్టీ లెవల్ మార్కెటింగ్ ఫ్రాడ్, జంప్డ్ డిపాజిట్ ఫ్రాడ్,నకిలీ విద్యుత్ బిల్లుల మోసాలు, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్, రుణ యాప్ల మోసాలు,ఆన్లైన్ పే మెంట్స్ అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్ ఫ్రేడ్స్ లోన్ యాప్ ల, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్, నకిలీ సిమ్ కార్డ్స్, లోన్ యాప్స్, అధికారుల పేరుతో వచ్చే ఫోన్ కాల్స్,నకిలీ వెబ్ సైట్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు.సైబర్ నేరాలకు గురైతే వెంటనే www.cybercrime.gov.in, లేదా సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 పిర్యాదు చేయాలని తెలిపారు.





