నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు): ఇటీవల మృతి చెందిన ఎర్ర రవి కుటుంబ సభ్యులకు కార్ డ్రైవర్స్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మృతుని కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందజేశారు. పట్టణంలోని గాంధీనగర్ చెందిన కార్ డ్రైవర్ ఎర్ర రవి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తోటి డ్రైవర్లు సుమారు 40000 నగదును అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్ డ్రైవర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు గాదే శ్రీనివాస్, ఎండి అంకుషావలి, ఉపాధ్యక్షులు అంబాల కన్నయ్య, కోశాధికారి మైస కర్ణాకర్, కార్యదర్శి బుర్ర కుమార్, ముఖ్య సలహాదారులు మైస సదానందం, ఎండి సర్వర్, కార్యవర్గ సభ్యులు రవీందర్ రెడ్డి, సమ్మయ్య, కందుగుల స్వామి, తుపాకుల శరత్, క్రాంతి కుమార్, రఘు, ఆకుల వినయ్, కొలిపాక సాయిరాం తదితరులు పాల్గొన్నారు.





