నేటి సాక్షి గోదావరిఖని (రమేష్)
రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాదులో జరుగుతున్న సిఎల్పీ సమావేశాల సందర్భంగా సీఎంను కలిసి పుష్పగుచ్చం అందించారు. రామగుండం నియోజకవర్గ అభివృద్ధి విషయంలో అవసరమైన నిధుల గురించి సీఎం దృష్టికి తీసుకు వెళ్లినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. జిల్లాలో కాంగ్రెస్ పార్టీ స్థితిగతులు, నియోజకవర్గ అభివృద్ధికి చేపట్టాల్సిన ప్రణాళికల గురించి సీఎం దృష్టికి తీసుకు వెళ్లినట్లు పేర్కొన్నారు. ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.





