
నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ
ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీరాజరాజేశ్వరస్వామి వారి హుండీ ఆదాయాన్ని మంగళవారం ఆలయం ఓపెన్స్లాబ్లో లెక్కించారు. ఆలయ 7 రోజల హుండీ ఆదాయం 1కోటి,28లక్షలు, 78వేల 106 రూపాయలు, 305 గ్రాముల బంగారం, 8కిలోల 200 గ్రాముల వెండిని సైతం భక్తులు కానుకలుగా సమర్పించుకున్నారు. ఆలయాధికారులు వెల్లడించారు. ఆలయ కార్యనిర్వాహణ అధికారి వినోద్ రెడ్డి, ఏసి కార్యాలయ పరిశీలకులు సత్యనారాయణ, ఏఈవోలు హుండీ లెక్కింపును పర్యవేక్షించారు. హుండీ కౌంటింగ్ నందు శివరామకృష్ణ భజన మండలి వారు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. ఆలయ సిబ్బందితో పాటు ఎస్పీఎఫ్, హోమ్ గార్డులు భద్రతా ఏర్పాట్లు చూసారు.






