నేటి సాక్షి ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల ( కోక్కుల వంశీ ): రాజన్న సిరిసిల్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ గా సాల్వాడి సమ్మయ్య శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా పనిచేసిన దుబ్బాక లావణ్య హైదరాబాద్ జీహెఎంసీకి బదిలీ అయ్యారు. ప్రస్తుతం హుజూరాబాద్ మున్సిపల్ కమిషనర్గా పనిచేస్తున్న ఎస్. సమ్మయ్య సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ గా నియమితులై బాధ్యతలు స్వీకరించారు.





