నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి ( గుండ ప్రశాంత్ గౌడ్ ): జగిత్యాల బుగ్గారం మండల కేంద్రంలోని కళ్యాణి ఇంగ్లీష్ హైస్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో చదువుతున్న వివిధ తరగతుల విద్యార్థినీ విద్యార్థులు తయారుచేసిన సైన్స్ ప్రాజెక్ట్ వర్క్స్ ఎంతగానో ఆకర్షించాయి. సైన్స్ డే లో భాగంగా వివిధ తరగతుల విద్యార్థిని విద్యార్థులు తయారు చేసినటువంటి సైన్స్ ప్రాజెక్ట్ వర్క్ లను ప్రదర్శించి విద్యార్థిని విద్యార్థులు వివరించారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ ఎండి అబ్దుల్ రహమాన్ ప్రిన్సిపాల్ బిసగోని రవి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.




