నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి):
ఇటీవల మరణించిన అల్లాడి రామేశం ద్వాదశదిన కర్మ సందర్భంగా, వారి కుమారులు అల్లాడి ప్రవీన్, మహేష్ మరియు వారి కుటుంబ సభ్యులు కోరుట్ల మున్సిపల్ కార్మికులకు బ్లాంకెట్లు పంపిణీ చేయడం జరిగింది. మరియు అన్నదానం చేయడం ద్వారా ఆదర్శనీయమైన కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా వేములవాడ రాజరాజేశ్వర ఆలయం ముందు ఉన్న యాచకులకు అన్నదానం చేసి, వారి సేవా మనోభావాన్ని చాటారు. అల్లాడి రామేశం స్వర్గలోక ప్రాప్తి కలగాలని మనస్పూర్తిగా కోరుకుంటూ, ఈ మానవతా కార్యక్రమాలను కొనసాగిస్తూ, వారికి స్మరణీయమైన సంతృప్తి చెందించడంలో కుటుంబ సభ్యుల కృషి ప్రశంసనీయమైంది అని పలువురు ప్రశంసించారు





