- ఘనంగా సత్కరించిన ఓదెల గ్రామ వాసులు
నేటి సాక్షి, వీణవంక : ఇటీవలే కరాటే బ్లాక్ బెల్ట్ వైజాగ్ లో జరిగిన ఇంటర్నేషనల్ కాట్మండు టోర్నమెంట్ లో అండర్ 14 విభాగాల్లో బంగారు పతకాన్ని ఓదెల గ్రామ వాసిని అయిన లభిశెట్టి శరణ్య సాధించడం జరిగింది. ఈ సందర్భంగా యువ క్రీడాకారిణి ని గ్రామంలోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఘనంగా శాలువాతో బేకరీ మధు తోపాటు, ముఖ్య అతిథులుగా రామచంద్రన్న, సదాశివ ఫౌండేషన్ భీష్మచారి, బుద్దె రాజన్న, వంగ రాయమలు, రామినేని కొమురయ్య, తుడి సతీష్ బోడకుంటి బాలరాజు, పచ్చిమట్ల అశ్రుత్, మంద పవన్, భోగి సంతోష్, ముంజల మహేందర్ గౌడ్, ఆశించెట్టి కృష్ణ లు సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.





