నేటి సాక్షి, ధర్మపురి ప్రతినిధి, ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గొల్లపల్లి మండలం స్కూల్ బస్సులను తనిఖీ చేసిన గొల్లపల్లి ఎస్సై సతీష్ రోడ్డు మరియు రహదారి భద్రత మాసోత్సవంలో భాగంగా జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు గొల్లపల్లి ఎస్సై సిహెచ్ సతీష్ గొల్లపల్లి మండల పరిధిలో గల ప్రైవేట్ స్కూల్ బస్సులను తనిఖీ చేయడం జరిగింది. ఈ తనిఖీలో భాగంగా ప్రతి స్కూల్ బస్సులో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలనీ మరియు డ్రైవర్ గాని క్లీనర్ గాని ఎట్టి పరిస్థితిలో తాగి డ్రైవింగ్ చేయొద్దని స్కూల్ బస్సులకు సంబంధించిన ఫిట్నెస్ సర్టిఫికెట్, ఆర్ సి ఇన్సూరెన్స్ మిగతా అన్ని సర్టిఫికెట్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ స్కూల్స్ యజమాన్యాలు మరియు డ్రైవర్లు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.




