నేటిసాక్షి ప్రతినిధి చందుర్తి (సతీష్)
చందుర్తి మండలం ఎన్గల్, లింగంపేట గ్రామాల శివాలయాల్లో గురువారం బిఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ నరసింహారావు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారిని నాయకులతో కలిసి చల్మెడ దర్శించుకుని స్వామి వారి ఆశీస్సులు తీసుకున్నారు. వారి వెంట మండల అధ్యక్షుడు ఎల్లయ్యతో పాటు సీనియర్ నాయకులు, ప్యాక్స్ చైర్మన్ జలగం కిషన్ రావు, నాయకులు చిలుక పెంటయ్య రమేష్ రావు, ఏనుగుల శ్రీనివాస్, గ్రామశాఖ అధ్యక్షులు, నాయకులు తదితరులు ఉన్నారు.




