Monday, March 30, 2026

10వ తరగతి విద్యార్థులకు స్టేషనరీ అందుచేత

  • 10 ఫలితాల్లో చంద్రగిరిని రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలపండి
  • డాలర్ గ్రూప్ అధినేత డాక్టర్ దివాకర్ రెడ్డి

నేటి సాక్షి తిరుపతి జిల్లా (బాదూరు బాల) : 10వ తరగతి పరీక్షా ఫలితాల్లో చంద్రగిరి నియోజకవర్గo రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలవాలనే మంచి సంకల్పంతో డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థుల వార్షిక పరక్షలకు అవసరమైన స్టేషనరీని ఉచితంగా అందచేస్తున్నట్లు ఆ ట్రస్ట్ చైర్మన్ డా. సి. దివాకర్ రెడ్డి తెలిపారు. చంద్రగిరి నియోజకవర్గo, తిరుచానూరు పంచాయతీలోని జడ్పీ హై స్కూల్ లో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైటింగ్ ప్యాడ్లు, బుక్ లు, పెన్నులు, పెన్సిల్లు, అరేజర్లు, షార్ప్ నర్లు ఉచితంగా అందచేశారు.మార్చి 17 నుంచి 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడంతో పాటుగా వారిని మరింత ప్రోత్సహించడం కోసం స్టేషనరీ అందచేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా. సి. దివాకర్ రెడ్డి, టీడీపీ నాయకులు మధుశేఖర్, కిశోర్ రెడ్డి,హరేరాం రెడ్డి,మునిరత్నం రెడ్డి,వాసు,బిరుదాల భాస్కర్ రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి విచ్చేసి, విద్యార్థులకు స్టేషనరీ అందచేసి, బెస్ట్ ఆఫ్ లక్ విషష్ తెలియచేశారు.ఈ సందర్భంగా డాలర్స్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డా.సి.దివాకర్ రెడ్డి మాట్లాడుతూ నేటి విద్యార్థులే, రేపటి ఉత్తమ పౌరులని, భవిష్యత్తు నిర్ణేతలని గుర్తు చేశారు.వారి భవిషత్తును నిర్దేశించేవి పరీక్షలేనని ఒత్తిడికి గురికాకుండా ప్రశాంత వాతావరణంలో విద్యార్థులు పరీక్షలు వ్రాసి, ఉత్తమ ఫలితాలను సాధించాలని ఆకాంక్షించారు. గతకొద్దీ సంవత్సరాలుగా సామాజిక కార్యక్రమాలను చేపడుతున్న తమ ట్రస్ట్, విద్యార్థులను ప్రోత్సహించి,100 శాతం ఉత్తీర్ణత సాదించడం కోసం ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News