- వరంగల్ సీపీ
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్ జిల్లా, స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : ఎవరైనా అక్రమంగా ఇసుక రావణాకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అధికారులను అదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇసుక అక్రమ రవాణా పై ఉక్కు పాదం మోపెందుకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు సన్నద్ధ మయ్యారు. ఇందులో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ వర్ధన్నపేట మండలం ల్యాబర్తి గ్రామ శివారులోని ఇసుక ర్యాంపులను పరిశీలించారు. ఇసుకను అక్రమంగా రవాణాకు పాల్పడే వారిపట్ల సున్నితంగా వ్యవహరించ వద్దని పోలీస్ కమిషనర్ అధికారులను అదేశించారు.





