నేటి సాక్షి, కొడిమ్యాల : కొడిమ్యాల మండల సంద్రాలపల్లి కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థులు ఆదివారం 16-02-2025 నాడు సిరిసిల్ల లో జరిగిన స్పార్క్ కుంగ్- ఫు అకాడమీ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన కుంగ్- ఫు, కరాటే చాంపియన్షిప్ 2025 లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు. ఈ సందర్భంగా గౌరవనీయులు కొడిమ్యాల ఎస్. ఐ. సందీప్ సిబ్బంది. పాఠశాల కు విచ్చేసి విద్యార్థులను అభినందించారు. ఎస్.ఐ. సందీప్ చేతుల మీదుగా గెలుపొందిన కడారి మాధురి, గోగుల బాలలక్ష్మి, గుండు ఐశ్వర్య, నేరెళ్ల ఐశ్వర్య, తిరుమణి సౌమ్య, తా పేట కీర్తన, దొంతర వేణి పూజ, గుంట భూమిక, బసనవేని మధుప్రియ, బసనవేని మానస, బొజ్జ రాఘవి, బుర్ర అర్చన, పల్లెపు వందన, సుర రమ్య, గరిగంటి హాసిని, బోనాల రేణుక, లకు పతకాలు, ట్రోపి, షీల్డ్ ను విద్యార్థులకు, కరాటే మాస్టర్ బి. లక్ష్మి రాజం అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల స్పెషల్ ఆఫీసర్ బి. లావణ్య , స్టాఫ్ మరియు కరాటే మాస్టర్ లక్ష్మి రాజం గారు పాల్గొన్నారు.





