నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి):
స్వామి వివేకానంద 162 వ జయంతి ఉత్సవాలను ఆదివారం ఘనంగా నిర్ణయించడం జరిగింది. కల్లూరు రోడ్డులో గల వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో సనాతన ధర్మ పరిరక్షణ సమితి, హిందూ ఐక్యవేదిక కన్వీనర్ మరియు జనసేన ఉమ్మడి కరీంనగర్ జిల్లా సీనియర్ నాయకులు వోడ్నాల రామారావు మాట్లాడుతూ స్వామి వివేకానంద ని ఆదర్శంగా తీసుకొని ప్రతి యువత తన జీవితంలో అతి ఉన్నతమైన స్థాయికి చేరుకోవాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో సురేష్, సంపత్, జగదీష్ మరియు జన సైనికులు సాయి కృష్ణ, అనిల్,సురేష్ ,రంజిత్, శశి మరియు అధిక సంఖ్యలో సనాతన ధర్మ పరిరక్షణ హిందూ ఐక్యవేదిక సభ్యులు మరియు జనసేన సైనికులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది





