
నేటి సాక్షి, అనంతగిరి: సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల కేంద్రంలోని హనుమంతు గుట్టపై వెలిసిన తెలంగాణ శబరిమల శ్రీ హరి హరి పుత్ర అయ్యప్ప స్వామి దేవాలయ 3వ వార్షికోత్సవ వేడుకలను ఆలయ కమిటీ చైర్మన్ కొండపల్లి మురళీకృష్ణ (వాసు) ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. దీనిలో భాగంగా భక్తులు స్వామిని దర్శించుకుని అయ్యప్ప స్వామి నామాన్ని జపించారు. ఈ సందర్భంగా గణపతి హోమం, విశిష్ట అభిషేకాలు పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పందిరి వీరయ్య,ఎరసాని కుమార్, గరిడేపల్లి ఉపేందర్, ఈధుల యాదగిరి, ఓరుగంటి రమేష్, వడ్డేపూడి వీరబాబు, అల్లె బోయిన కోటయ్య, గాదం శ్రీను, సంగబోయిన ఉపేందర్, గవిని రామకృష్ణ, యరసాని రవి, దాతలు య యశ్వంత్, ఐయితబోయిన వెంకటేశ్వర్లు, జగిని ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





