నేటి సాక్షి, కోరుట్ల టౌన్ (గణేష్ గొల్లపల్లి): కోరుట్ల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ మంగళవారం సందర్శించారు. పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులతో ఆయన మాట్లాడుతూ, ఎలాంటి ఒత్తిడి లేకుండా చదివి, మంచి మార్కులు సాధించాలని, విద్యార్థులను కోరారు.సరైన భోజనం అందిస్తున్నారా, లేదా, హాస్టల్ లో పరిస్థితి బాగా ఉందా అని అడిగి,ఎటువంటి సమస్య వచ్చిన నాకు తెలుపాలని కోరారు. తల్లిదండ్రుల కలలు నెరవేర్చాలని, మీ పరీక్షా ఫలితాలకోసం తల్లిదండ్రులు వేచి చూస్తున్నారని, వారు గర్వపడేలా ఫలితం రావాలని ఆకాంక్షించారు.





