- మిలాద్-ఉన్-నబీని ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకోవాలి
- కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్రావు
- ముస్లిం సోదరులకు మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు
నేటి సాక్షి, కరీంనగర్: శాంతి, కరుణ, సోదరభావాన్ని చాటి చెప్పే మహమ్మద్ ప్రవక్త బోధనలు యావత్ మానవాళికి దిక్సూచి లాంటివని కాంగ్రెస్ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాద్-ఉన్- నబీ పర్వదినాన్ని పురస్కరించుకొని ముస్లిం సోదరులు, సోదరీ మణులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వెలిచాల రాజేందర్ రావు మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధించిన సహనం, సత్యనిష్ట, పవిత్రత, సహాయం, దయ అనే పంచ సూత్రాలు మానవీయ జీవితానికి బాటలు వేస్తాయని పేర్కొన్నారు. ప్రతీ ముస్లీం సోదరుడు ఆ ప్రవక్త ప్రవచించిన సన్మార్గాలను పాటిస్తూ, పవిత్ర మిలాద్-ఉన్-నబీ పండగను ఇంటింటా భక్తిశ్రద్ధల మధ్య, ఆనందో త్సవాలతో జరుపుకోవాలని ఆయన సూచించారు. ప్రవక్త చెప్పిన శాంతి మార్గమే ప్రతి ఒక్కరికీ ఆచరణీయమని, అందుకు అనుగుణంగా ముందుకెళ్లాలని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.

