Monday, January 19, 2026

దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర కీలకం

  • కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్ పెయ్
  • ఘనంగా ఇంజనీర్స్ డే

నేటి సాక్షి, కరీంనగర్​: దేశాభివృద్ధిలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని కరీంనగర్ నగర పాలక సంస్థ కమిషనర్ చాహత్ బాజ్ పేయ్ పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్ లోని తెలంగాణ పవర్ డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ వారి ఆధ్వర్యంలో జరిగిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య జయంతి, ఇంజనీర్స్ డే కార్యక్రమానికి నగరపాలక సంస్థ కమిషనర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చాహత్ బాజ్ పేయ్ మాట్లాడుతూ ప్రాచీన కట్టడాల నిర్మాణాల్లో ఇంజనీర్లు ఎంతో శ్రమకొర్తి కృషి చేశారని తెలిపారు. రోజురోజుకు వస్తున్న మార్పులకు కనుగుణంగా ఇంజనీర్లు మరింత పనితీరును మెరుగుపరచుకోవాలని సూచించారు. వారి నైపుణ్యాలను పెంచుకుంటూ కొత్త కొత్త పరిశోధనలు నిర్వహించుకుంటూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు. రాష్ట్ర దేశాభివృద్ధిలో ఇంజనీర్ల పనితీరు ఎంతో కీలకంగా మారిందని తెలిపారు. ఎన్పీడీసీఎల్ ఎస్ఈ వీ గంగాధర్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఇంజనీర్లు ఎంతో మంచి పేరు గడుస్తున్నారని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా పనితీరును మెరుగుపరుచుకుం టూ ఇంకా మరింత మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఇందులో పలువురు ఇంజనీర్లు, అధికారులను మున్సిపల్ కమిషనర్ ఎన్పీడీసీఎల్ ఎస్ ఈ ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో లయన్స్ క్లబ్ ఆఫ్ కరీంనగర్ అధ్యక్షుడు ముక్క శరత్ కృష్ణ, ప్రధాన కార్యదర్శి మ్యాడం శివకాంత్, కోశాధికారి బట్టు వినోద్, పీడీజీలు చిదుర సురేష్, కొండా వేణుమూర్తి, ఆర్ సి కొండ రాంబాబు, ప్రోగ్రాం చైర్మన్ సాయినేని నరేందర్, పీఆర్వో ఎలగందుల రవీందర్, జెడ్ సి లంబు సుధాకర్ రెడ్డి, లయన్స్ క్లబ్ ప్రతినిధులు సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News