Wednesday, January 21, 2026

సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం

  • మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు సభ్యులు

నేటి సాక్షి ప్రతినిధి, వేములవాడ :
స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసి, దేశంలోనే తొలి బాలికల పాఠశాల ప్రారంభించి, బాల్య వివాహాలపై అలుపెరుగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి సంఘ సంస్కర్త శ్రీమతి సవిత్రీబాయి పూలే అని మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు సభ్యులు అన్నారు. సవిత్రీబాయి పూలే జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం జనవరి, 3న అధికారికంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ప్రకటించిన సందర్భంగా విద్యార్థినీ, విద్యార్థుల భవిషత్తుకు తమ వంతుగా విద్యాబుద్ధులు నేర్పుతున్న మహిళా టీచర్లను సన్మానించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వ బాలికల పాఠశాలలో పనిచేసే మహిళా ఉపాధ్యాయులు టి.మాధవి, కె. రాధిక, సీ.హెచ్. అరుంధతి, ఏ. సరళ, టి.సరిత, ఎన్. స్వాతిలను మై వేములవాడ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో శాలువాతో ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందజేయడం జరిగిందని ట్రస్టు నిర్వాహకులు మధు మహేష్ తెలిపారు. ట్రస్టు సభ్యులు డాక్టర్ రవీందర్ మాట్లాడుతూ విద్యార్థులకు విద్యా బుద్ధులు నేర్పడమే కాక వారు చెడు మార్గాల్లో ప్రయాణించకుండా సక్రమ మార్గంలో పయనించేలా పలు సూచనలు చేస్తూ, మంచిబాటలో పయనించేలా కృషి చేస్తున్న ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని, ఈ సందర్భంగా ఉపాధ్యా యుని ఉపాధ్యాయులకు అభినందనలు తెలియజేస్తున్నామన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News