Tuesday, March 10, 2026

“మన ఇంటి మందం మన పంట”

  • గ్రామ నవ నిర్మణ్ సమితి ఆధ్వర్యంలో

నేటి సాక్షి, జమ్మికుంట: ప్రకృతి వ్యవసాయం ప్రాజెక్టు లో భాగంగా “మన ఇంటి మందం మన పంట” ప్రకృతి వ్యవసాయం అనే సంకల్పంతో రసాయన ఎరువులు వాడకుండా ప్రకృతి తయారు చేసినటువంటి సహజ వనరులతో వ్యవసాయం చేయాలని ముఖ్య ఉద్దేశంతో మన ఆరోగ్యాలను కాపాడాలని మన ముందు తరాలకు మనం చరిత్రగా మిగలాలని దీని ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఇల్లంతకుంట మండలం కనగర్తి గ్రామంలో దరువుల కనకయ్య అనే రైతు ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయంలో భాగమైనాడు. ఎకరం వ్యవసాయ భూమిలో జీవామృతం ఆవు పేడ, ఆవు మూత్రం, బెల్లం, పప్పులపిండి, రసాయనాలు కలపని మట్టి లేదా పుట్ట మట్టి తయారు చేయించి భూమికి పారించడం జరిగింది. దీనివల్ల భూమిలో ఉన్న పాజిటివ్ సూక్ష్మజీవులన్నీ భూమి పైకి వచ్చి మరియు భూమి యొక్క సాంద్రతను పెంచి పంట ఏపుగా ఎదిగేలా సహాయపడుతుంది. దీనివల్ల మనకు ఆరోగ్య సమస్యలు కూడా తగ్గుముఖం పడతాయి. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కుమారస్వామి, ఫీల్డ్ స్టాఫ్ అజయ్ బొమ్మిదేని, అకేంద్ర, మమత, రైతులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News