Tuesday, March 24, 2026

మహాశివరాత్రి ని పురస్కరించుకొని జిల్లా లోని ఆలయాలలో పటిష్టమైన పోలీస్ బందోబస్తు

  • జాతరకి వచ్చే భక్తులకు భద్రతాపరమైన ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేయాలి

నేటి సాక్షి – ధర్మపురి ప్రతినిధి, ( గుండ ప్రశాంత్ గౌడ్ ) : పెంబట్ల దుబ్బ రాజన్న స్వామి మల్లాపూర్ కనక సోమేశ్వర స్వామి ఆలయాలలో భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ సారంగాపూర్ పోలీస్ స్టేషన్ పరిదిలోని పెంబట్ల కోనాపూర్ గ్రామంలో గల పుణ్యక్షేత్రం దుబ్బ రాజన్న స్వామి, మల్లాపూర్ మండల కేంద్రంలో గల కనక సోమేశ్వర స్వామి జాతరల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని ఎస్పీ అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి సందర్భంగా జరుగు జాతర కు ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు వచ్చే అవకాశం ఉందని, ఏలాంటి నేరాలకు తావులేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేయాలని సూచించారు.ఆలయ పరిసరాల్లో క్యూలైన్లలో వాహనాల రాకపోకలు మొదలైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయవలసిన భద్రత ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు చేశారు. అదేవిధంగా ఆలయ పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.భక్తులకు ఏవైనా ఇబ్బందులు ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్ ను సంప్రదించాలని సూచించారు. దర్శనానికి వచ్చే భక్తులు పోలీసు వారి సలహాలు సూచనలు పాటిస్తూ స్వామి వారిని దర్శించుకుని క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు అనంతరం ఆలయంలో స్వామీ వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా అర్చకులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందజేశారు జిల్లా ఎస్పీ వెంట రూరల్ సీఐ కృష్ణ రెడ్డి సారంగాపూర్ ఎస్సై దత్తాద్రి, మల్లాపూర్ ఎస్.ఐ రాజు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News