- పెద్దపులి నాగారం మాజీ సర్పంచ్ ఈదుల ప్రతాప్ రెడ్డి
- ఈదుల సాయి కృష్ణారెడ్డి ఘన నివాళి
నేటి సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం పెద్దపులి నాగారం గ్రామానికి చెందిన ఈదుల ప్రతాప్ రెడ్డి 33వ వర్ధంతి సందర్భంగా పెద్దపులి నాగారం గ్రామంలో ఉన్న ప్రతి నాయకుడు.. లీడర్ అంటే ఈ విధంగా ఉండాలి అని తెలియజేసిన వ్యక్తి ఏకైక వ్యక్తి ప్రతాప్ రెడ్డి, అతను బయటికి వెళ్తున్నాడు అంటే అతని వెంట ఒక 100 మంది ఆయన అడుగుజాడలలో నడిచి ఆయన వెంట ఉండి నేడు రాజకీయ రంగంలో ముందుకు కొనసాగుతున్నరంటే దానికి కారణం ఈదుల ప్రతాప్ రెడ్డి, ఎంతోమందికి రాజకీయపరంగా పేద వాళ్ళకి అండగా అప్పట్లోనే రెడ్డి వైఖరి చూపించకుండా ప్రతి వ్యక్తిని కలుపుకొని ముందుకు కొనసాగిన ఏకైక వ్యక్తి ప్రతాప్ రెడ్డి, నేడు అనగా మార్చి 16 రోజున అతని వర్ధంతి సందర్భంగా గ్రామ ప్రజల అందరి తరపున కుటుంబ సభ్యులందరి తరఫున ప్రత్యేకమైన శ్రద్ధాంజలి తెలియజేస్తున్నాము.





