Friday, April 3, 2026

పోలీస్ కమిషనర్ ను కలసిన టీడబ్ల్యూజెఎఫ్ నాయకులు

నేటి సాక్షి-కరీంనగర్:
కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన గౌస్‌ ఆలం ను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజెఎఫ్) జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సీపీకి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో అవినీతి, అక్రమాలను అరికట్టాలని సీపీ ని కోరారు. కరీంనగర్ ను నేర రహిత జిల్లా గా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో ముందుకు సాగాలని ఈ సందర్భంగా సీపీ కి విజ్ఞప్తి చేశారు. పోలీస్ కమిషనర్ ను కలసిన వారిలో రాష్ట్ర కమిటీ సభ్యుడు గాదె కరుణాకర్ రావు, జిల్లా సహాయ కార్యదర్శి జి. కిరణ్, నాయకులు ఎల్ సురేష్ లు ఉన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News