Tuesday, March 17, 2026

జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్న

  • జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్, ( రమేష్ ) : తెలంగాణ రాష్ట్రంలో ఏకైక శక్తిపీఠమైన జోగులంబ అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా సోమవారం వసంత పంచమి పురస్కరించుకొని జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ అమ్మవారిని దర్శించుకొని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అంతకుముందు ఆలయ కమిటీ చైర్మన్ కొంకల నాగేశ్వర్ రెడ్డి, ఈఓ పురేందర్ ఆలయ ఆర్చకులతో కలిసి ఘన స్వాగతం పలికారు. వీరి వెంట కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్లు డిటిడిసి అనిత, శారద, అరుణ, లక్ష్మీ, లక్ష్మీదేవి, మధుసూదన్ బాబు, అల్వాల రాజశేఖర్ రెడ్డి, పెదొడ్డి రామకృష్ణ, లత్తిపురం వెంకట్రామిరెడ్డి, డి.ఆర్.శ్రీధర్, సద్దనోముపల్లి గోపాల్, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తిరుమలేష్, వెంకటేష్, ఆలయ కమిటీ డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News