- అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరితమ్మ
- జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ
- మున్సిపల్ మాజీ చైర్మన్ బి.ఎస్. కేశవులు

నేటి సాక్షి ప్రతినిధి గద్వాల్ ( రమేష్ ) : గద్వాల నియోజకవర్గం మల్దకల్ మండల కేంద్రంలోని అది శిలాక్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి (మల్దకల్ తిమ్మప్ప స్వామి) ఆలయంలో జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ మున్సిపల్ మాజీ చైర్మన్ బి.ఎస్.కేశవ్..ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్ధప్రసాదాలు స్వీకరించారు. అనంతరం స్వామివారి సన్నిధిలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బోరుబండి వీరన్న ఏర్పాటు అన్నదాన కార్యక్రమంలో జెడ్పి మాజీ చైర్ పర్సన్ సరితమ్మ.గద్వాల పట్టణ మున్సిపల్ మాజీ చైర్మన్ బి.ఎస్.కేశవ్ అన్నదాత లతో కలిసి అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





