నేటి సాక్షి, ఉమ్మడి వరంగల్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (సందెల రాజు) : అక్రమ ఇసుక రవాణాను అరికట్టేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో తీసుకున్న చర్యల్లో భాగంగా కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్ పోస్టులో ఒకటైన కంఠాత్మకూర్ చెక్ పోస్ట్ను పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా శుక్రవారం రాత్రి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా ఇప్పటి వరకు ఎన్ని ట్రాక్టర్లను సీజ్ చేయడం జరిగింది, ఎన్ని కేసులు నమోదు అయ్యాయని సీపీ ఆత్మకూర్ ఇన్స్పెక్టర్ సంతోష్ను అడిగి తెలుసుకున్నారు.





