నేటి సాక్షి, మహబూబాబాద్ నర్సింహులపేటభూక్యా రవి : మండలంలోని వంతడపుల స్టేజి గ్రామానికి చెందిన ముదిశెట్టి శైలజ (30) ఆదివారం రాత్రి విద్యుత్ షాక్తో మృతి చెందింది. రాత్రి కారం, పిండి పట్టే మిల్లుకు శుభ్రం చేస్తు, పట్టా కప్పుతున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురైంది. వెంటనే గమనించిన తల్లి జయమ్మ , పక్కన ఉండే వారి సహాయంతో 108 లో హాస్పిటల్ కు తీసుకెళ్లగా చనిపోయింది అని తెలిసింది, మృతురాలికి ఓ కుమారుడు ఉన్నారు. మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సురేష్ తెలిపారు.





