- ఫోనును గమనించిన కండక్టర్ జితేందర్
నెట్ సాక్షి ప్రతినిధి, మహేశ్వరం(చిక్కిరి శ్రీకాంత్): రంగారెడ్డి జిల్లా మహేశ్వరం 20/1 సర్వీస్ మహేశ్వరం డిపో లో కొత్తూర్ బస్టాప్ లో ఒక లేడీ ప్యాసింజర్ ఎక్కి తిమ్మాపూర్ ఎక్స్ రోడ్ లో దిగారు. ఆమె బస్సులో తన విలువైన ఫోన్ మర్చిపోయి దిగేశారు. కండక్టర్ జితేందర్ గమనించి ఫోను తీసుకొని ఆమె తన ఫోనుకు రింగ్ చేస్తుండగా ఆమెతో మాట్లాడి ఆమె కొడుకుని శంషాబాద్ పంపించగా ఆ ఫోను ఆమె కొడుకుకి డ్రైవర్ రామ్ చందర్ తో కలసి అందించడం జరిగింది.




