- మాజీమంత్రి సబితా ఇంద్రారెడ్డి

నేటిసాక్షి ప్రతినిధి, మహేశ్వరం (చిక్కిరి శ్రీకాంత్) : మహేశ్వరం మండల బిఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే స్థానిక సంస్థలు ఎన్నికలకు అందరు కూడా సిద్ధంగా ఉండాలని నా గెలుపులో మీరున్నారు. మీ గెలుపులో కూడా నేను కచ్చితంగా ఉంటానని నాయకులకి కార్యకర్తలకి దశ దిశను నిర్దేశించారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మండలం టిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, సబితా ఇంద్రారెడ్డి అభిమానులు తదితరులు పాల్గొన్నారు.





