నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి డిసెంబర్ 25 పుంగనూరు నియోజవర్గం చౌడేపల్లి మండలంలో వెలిసిన రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాల స్వామి ఆలయంలో గురువారం కోయిల్ అల్వార్ తిరువంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని ఆలయంలో ప్రధాన అర్చకుడు వశిష్టాచార్యులు ఆధ్వర్యంలో కోయిల్ అల్వార్ తిరువంజనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు ఆలయ శుద్ధి అనంతరం పలు కార్యక్రమాలు జరిగాయి వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయంలో ఉత్తర ద్వారా దర్శనం ఉంటుందని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలిపారు





