అధికారులు,నాయకులు సన్న బియ్యం పథకంతో భోజనం….. నేటి సాక్షి, నారాయణపేట, ఏప్రిల్ 7,నారాయణ పేట జిల్లా నర్వ మండలం లంకాల్ గ్రామం లో సోమవారం సన్న బియ్యం పథకం కింద కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ కార్డు దారునికి ఉచిత సన్న బియ్యం కార్యక్రమాన్ని నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి చేతుల మీద ప్రారంభించడం జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట జిల్లాలోని పూసలపాడు గ్రామంలో ని అధికారులు నాయకులు ఆధ్వర్యంలో ప్రారంభించారు. అనంతరం సన్న బియ్యం పథకంతో చేసిన భోజనాన్ని అధికారులు, నాయకులు చేశారు.





