Saturday, March 21, 2026

మల్లన్న సాగర్ నిర్వాసితుల సమస్యలపై సీఎం స్పందించాలని డిమాండ్

నేటి సాక్షి గజ్వేల్ :—సిద్దిపేట జిల్లా నర్మేటలో నిర్వహిస్తున్న రైతు పర్యటనలో ఎనుముల రేవంత్ రెడ్డి ముందుగా మల్లన్న సాగర్ నిర్వాసిత రైతుల సమస్యలపై మాట్లాడాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు బండ్ల స్వామి డిమాండ్ చేశారు.స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు कि మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో నిర్వాసిత గ్రామాల ప్రజలు భూసేకరణకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టారని గుర్తుచేశారు. ఆ సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి నిర్వాసితుల పక్షాన నిరాహార దీక్ష కూడా చేసినట్లు తెలిపారు.అయితే, అప్పటి ప్రభుత్వం నిర్వాసితుల సమస్యలను పట్టించుకోకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిందని, ఇప్పటికీ బాధితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం, పునరావాస సదుపాయాలు అందలేదని ఆరోపించారు. కోర్టులు నిర్వాసితుల పక్షాన ఇచ్చిన తీర్పులు కూడా అమలు కావడం లేదని ఆయన విమర్శించారు.అదేవిధంగా రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్, అనంతగిరి, గౌరవెల్లి వంటి ఇతర ప్రాజెక్టుల నిర్వాసితుల సమస్యలపై కూడా సీఎం స్పందించాలని కోరారు.నిర్వాసితులకు ఎలాంటి షరతులు లేకుండా రైతు బీమా, రైతు భరోసా తరహాలో దీర్ఘకాలిక సహాయ పథకం ప్రకటించాలని డిమాండ్ చేశారు. గజ్వేల్ పట్టణంలో ఏర్పాటు చేసిన కాలనీలలో కనీస మౌలిక వసతులు—రోడ్లు, డ్రైనేజీ, వైద్య సదుపాయాలు, విద్యాసంస్థలు, స్మశాన వాటికలు—లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.నిరుద్యోగ యువత ఉపాధి లేక సమస్యల్లో పడుతున్నారని, గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా లభించిన అవకాశాలు ఇప్పుడు లేవని చెప్పారు.ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో నిర్వాసితులు ప్రభుత్వంపై నమ్మకం ఉంచి మద్దతు తెలిపారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలని సీఎం ను కోరారు.లేనిపక్షంలో నిర్వాసితులతో కలిసి ఐక్యంగా ఉద్యమాలు చేపట్టి హక్కులు సాధించుకుంటామని హెచ్చరించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -spot_img

Latest News