నేటి సాక్షి, హుజురాబాద్ ఆర్.సి. (రాఘవుల శ్రీనివాసు):
హుజురాబాద్ హైస్కూల్ నందు wwf india, నవక్రాంతి ఉత్పత్తి దారుల సంస్థ వారి ఆధ్వర్యంలో ఎర్త్ అవర్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. బీసీఐ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ బొట్ల సతీష్ కుమార్ మాట్లాడుతూ wwf india వారూ పర్యావరణ పరిరక్షణకు, భూతాపాన్ని తగ్గించడం కొరకు ప్రతి సంవత్సరం మార్చ్ 22 న ఒక గంట పాటు అనవసరమైన విద్యుథ్, ఎలక్ట్రానిక్ పరికరాలు స్విచ్ ఆఫ్ చేయడం అనే కార్యక్రమాన్ని 2007 నుండి కొనసాగిస్తున్నారని తెలపడం జరిగింది. ఇలా స్విచ్ ఆఫ్ చేయడం సహజ వనరుల సంరక్షణ జరుగుతుందని తెలపడం జరిగింది. కార్యక్రమంలో హుజురాబాద్ వాకర్ అసోసియేషన్ అధ్యక్షుడు,సెక్రటరీ, సభ్యులు మరియు బీసీఐ సిబ్బంది పాల్గొనడం జరిగింది.





