నేటి సాక్షి కొమరం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జూన్ 19:ఎల్లవేళలు పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సిర్పూర్ యూ కు చెందిన మడవి ఆనంద్ కుమార్ (2012 పోలీస్ బ్యాచ్) తేది 04.11.2024 న గుండెపోటుతో మరణించగా ఆయన సతీమణి గంగామణి కి భద్రత ఎక్స్గ్రేషియా 8,00,000/- రూపాయల చెక్కు ను ఈ రోజు జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ ఐపిఎస్., జిల్లా పోలీస్ కార్యాలయం లో వారికి అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ గారి కుటుంబ ప్రస్తుత స్థితిగతులను ఎస్పీ అడిగి తెలుసుకోవడంతో జరిగింది. వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని వారి కుటుంబానికి భరోసా ఇచ్చారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని ఎస్పీ అన్నారు.
ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రాణా ప్రతాప్, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు విజయ శంకర్ రెడ్డి, ఆర్.ఐ అడ్మిన్ పెద్దన్న, జిల్లా పోలీసు కార్యాలయ ఎ.ఓ శ్రీనివాస్, ఎ సూపరిండెంట్ ఖలీల్ లు పాల్గొన్నారు.

