–సిఐ మచ్చ శివకుమార్
నేటి సాక్షి ఉమ్మడి వరంగల్
(సందెల రాజు)
గుడుంబా తయారీకి ఉపయోగపడే నల్ల బెల్లం పటికను అక్రమంగా మహారాష్ట్ర నుండి తరలిస్తున్న వ్యక్తిని హనుమకొండ బస్టాండ్ లో అదుపులోకి తీసుకొవడం జరిగింది గూడూరు మండలం ఇప్ప తండాకు చెందిన ధరావత్ లచ్చిరామ్ అక్రమంగా గుడుంబా తయారు చేస్తూ ఊర్లో అమ్ముతున్నాడు అదే క్రమంలో శుక్రవారం మహారాష్ట్ర నుండి పదివేల రూపాయల విలువ గల నల్ల బెల్లం మరియు పట్టికను తరలిస్తుండగా హనుమకొండ పోలీసులు పట్టుకొని కేసు నమోదు చేయడం జరిగింది ఇతన్ని పట్టుకున్న ఏఎస్ఐ రఘునారెడ్డి కానిస్టేబుల్ కరుణాకర్ ని సిఐ అభినందించారు.





