నేటి సాక్షి – జగిత్యాల టౌన్ (పూరెళ్ల బాపు)…..,………….,………………….జగిత్యాల జిల్లాలో చైనా మంజా పూర్తిగా నిషేధించబడింది.ప్రజల,పక్షుల భద్రత & పర్యావరణ సంరక్షణ కోసం ఈ నియమాన్ని కఠినంగా అమలు చేస్తున్నాం అని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఐపీఎస్ అన్నారు.జిల్లాలో చైనా మంజాను అమ్మినా, కొన్నా లేదా ఉపయోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోబడతాయని,ఎక్కడైనా చైనా మంజా విక్రయం లేదా నిల్వ ఉన్నట్లు కనిపిస్తే, ఆలస్యం చేయకుండా 8712672000 నంబర్కు/ Dial_100 కి కానీ ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని మీ సమాచారం ఒక జీవితాన్ని కాపాడవచ్చని ఎస్పీ అన్నారు.

