నేటి సాక్షి, గన్నేరువరం,( బుర్ర అంజయ్య గౌడ్):* న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని గన్నేరువరం ఎస్సై జి నరేందర్ రెడ్డి ఒక ప్రకటనలో మండల ప్రజలకు సూచించారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకోవాలని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. న్యూ ఇయర్ వేడుకలను కుటుంబ సమేతంగా ఇళ్లలో సంతోషంగా నిర్వహించుకోవాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ట్రిపుల్ రాష్ రాంగ్ రూట్ డ్రైవింగ్ దాడులు బెదిరింపులకు పాల్పడడం రోడ్లపై వెళ్లే వారిని ఇబ్బంది చేస్తే చర్యలు తీసుకుంటామని అన్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను బయటకు పంపించి ఇబ్బందులు పడవద్దన్నారు. మండల ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో నియర్ వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. అనంతరం మండల ప్రజలకు ఎస్సై జి నరేందర్ రెడ్డి నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు.

