నేటి సాక్షి /శంకర్ పల్లి :శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని సింగపూర్ 10 వార్డ్ లో కౌన్సిలర్ తన వార్డ్ ప్రజలు ఆధార్ కు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని తన స్వంత ఖర్చుతో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేసి ప్రారంభించారు, ఈసందర్బంగా మాట్లాడుతు ప్రజలకు ఎల్లపుడు అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి మొదటి ప్రాధాన్యత ఇస్తానని అన్నారు, వార్డ్ పరిధిలో ఆధార్ సెంటర్ లేకపోవడంతో తానే స్వంత ఖర్చుతో ఈ ఆధార్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు తన వార్డ్ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అన్నారు, 10 వార్డ్ కౌన్సిలర్ లాగానే శంకర్ పల్లి మున్సిపల్ పరిధిలోని మిగతా కౌన్సిలర్లు కూడా ఏర్పాటు చేయాలనీ మున్సిపల్ లోని వివిధ వార్డ్ ప్రజలు కోరుతూన్నారు





