*నేటి సాక్షి, జగిత్యాల ప్రతినిధి:* ( గుండ ప్రశాంత్ గౌడ్ )జగిత్యాల జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఆదేశాల మేరకు, శుక్రవారం రోజున ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎస్ఐ జి. మహేష్ మరియు సిబ్బంది ఆధ్వర్యంలో నిషేధిత చైనా మాంజా విక్రయాలపై విస్తృత తనిఖీలు నిర్వహించటం జరిగింది.ఈ తనిఖీల్లో భాగంగా ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న గాలిపటాల దుకాణాలు, స్టేషనరీ షాపులు మరియు తాత్కాలిక విక్రయ కేంద్రాలను పరిశీలించటం జరిగింది. ఈ సందర్భంగా చైనా మాంజా వలన మనుషులకు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులకు మరియు చిన్నారుల ప్రాణాలకు తీవ్రమైన ప్రమాదం ఉందని దుకాణదారులకు వివరించడం జరిగింది.అలాగే, ఎవరైనా నిషేధిత చైనా మాంజాను విక్రయించినా నిల్వ ఉంచినా లేదా రవాణా చేసినా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ ఐ జి. మహేష్ తెలిపారు

