నేటిసాక్షి , కరీంనగర్: ముస్లిం మైనార్టీ నాయకులు సమష్టిగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కరీంనగర్ అసెంబ్లీ ఇంచార్జి వెలిచాల రాజేందర్రావు అన్నారు. కరీంనగర్ 5వ డివిజన్లోని ముస్లిం మైనార్టీ నాయకులు బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు పాటుపడాలని సూచించారు. జైనుల్లా బుద్దిన్, ఇమాముదీన్ ముబిన్, రజాక్ కెరుద్దీన్, అబ్దుల్ రషీద్తో పాటు పలువురు పార్టీలో చేరారు.





