నేటిసాక్షి న్యూస్ ఏప్రిల్ 13మంత్రాలయం మఠం క్వార్టర్స్ సమీపంలో సిలిండర్లు పేలి జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయిన రాజస్థాన్ కార్మికులను ఎంపీటీసీ మేకల వెంకటేశు, సీఐ దస్తగిరి బాబు, ఎస్ఐ మల్లికార్జున పరామర్శించారు. ప్రమాదంలో షెడ్లు పూర్తిగా దగ్ధమై నిరాశ్రయులైన బాధిత కుటుంబాలకు తక్షణ ఉపశమనంగా రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని నాయకులు తెలిపారు.





