నేటి సాక్షి 21 ఏప్రిల్ పాములపాడు:- నంద్యాల జిల్లా, నందికొట్కూరు నియోజవర్గం, పాములపాడు మండలంలోని, వేంపెంట గ్రామానికి చెందిన వరల్డ్ హ్యూమన్ రైట్స్ అవార్డు గ్రహీత & తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు సింగపూర్ దేశానికి మూడు రోజుల శిక్షణ కొరకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులకు మా హృదయపూర్వక మరియు ఘన స్వాగతం పలకడం జరిగింది.ఈ సందర్భంగా సింగపూర్ తెలుగు సమాజం ఉపాధ్యక్షుడు & అంతర్జాతీయ సమాజ సేవకుడు డాక్టర్ టేకూరి.నాగేశ్వరరావు ప్రత్యేక శిక్షణ కొరకు సింగపూర్ కు వచ్చిన కింజారపు.అచ్చెన్నాయుడు(వ్యవసాయం, పశుసంవర్ధక, పాల అభివృద్ధి మరియు మత్స్యశాఖల మంత్రి), పొంగూరు.నారాయణ(మునిసిపల్ పరిపాలన మరియు పట్టణాభివృద్ధి శాఖల మంత్రి), వంగలపూడి.అనిత(గృహ వ్యవహారాలు మరియు విపత్తు నిర్వహణ ల శాఖ మంత్రి), సత్య కుమార్ యాదవ్(ఆరోగ్యం, వైద్య మరియు కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి),అనగాని సత్య ప్రసాద్ (రెవెన్యూ, రిజిస్ట్రేషన్స్ మరియు స్టాంపుల శాఖల మంత్రి), బి.సి.జనార్ధన్ రెడ్డి(రాష్ట్ర రోడ్లు & భవనాలు, మౌలిక సదుపాయాలు మరియు పెట్టుబడుల శాఖల మంత్రి), మంత్రివర్యులను కలుసుకుని అందరికీ పుష్పగుచ్చాలు చేతికి అందించి ఘనంగా ఆత్మీయ స్వాగతం పలకడం జరిగింది. వారి యోగక్షేమాల గురించి, కుశల ప్రశ్నలు అడిగి తెలుసుకోవడం చాలా ఆనందంగా ఉందనీ అన్నారు.





