నేటి సాక్షి న్యూస్ చౌడేపల్లి ఏప్రిల్ 14 భారత రాజ్యాంగ రూపకర్త , భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి కార్యక్రమాన్ని స్థానిక ఎం ఆర్ సి ప్రాంగణంలో చౌడేపల్లి ఎస్ టి యు ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి, జోహార్లు అర్పిస్తూ ఘనంగా నిర్వహించడం జరిగినది .ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మండల విద్యాశాఖ అధికారులు శ్రీ కేశవ రెడ్డి గారు, శ్రీమతి తిరుమలమ్మ గారు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ, వారు భారతదేశానికి స్వాతంత్ర సమరంలో మరియు భారత రాజ్యాంగ రూపకల్పనలో ఎనలేని కృషిచేసి అందరి హృదయాలలో స్థిరస్థాయిగా , మార్గదర్శకులుగా నిలిచారని అంబేద్కర్ సేవలను కొనియాడడం జరిగినది. జిల్లా అసోసియేట్ అధ్యక్షులు శ్రీ లింగమూర్తి యాదవ్ మాట్లాడుతూ సమాజంలోని వెనుకబడిన వర్గాలు కూడా విద్య ఉద్యోగాలలో రాణించుటకు, అస్పృశ్యత నివారణకు అనేక ఉద్యమాలు చేసి రిజర్వేషన్ల అమలకు ఎనలేని కృషి చేశారని తెలియజేయడం జరిగినది. మండల అధ్యక్షులు శ్రీమతి వసంత గారు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకుపోవుటకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ముఖ్యంగా మహిళలు అన్ని రంగాలలో రాణించాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎస్ టి యు మహిళా అధ్యక్షులు శ్రీమతి సుమిత్ర, ఆర్థిక కార్యదర్శి షబ్బీర్ అహ్మద్ మరియు కార్యవర్గ సభ్యులు నాగరత్నమ్మ , మురళీమోహన్, తులసి నాగరాజ, విజయ కుమారి, సుధాకర్ నాయుడు, వెంకటస్వామి, కృష్ణవేణి, భాను, శేషాద్రి మరియు సభ్యులు పాల్గొనడం జరిగినది.💐🙏





